శ్రీ పుత్ర గణపతి స్తోత్రం (పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి)
"అందరికీ ఉపయోగపడేవిధంగా ఈ పోస్ట్ ని అందరూ షేర్ చేయగలరు
‘‘సాక్షాత్ రుద్ర ఇవాపరః’’ అన్నట్లుగా జగదంబ అనుగ్రహముతో జన్మించి రుద్రానుగ్రహముతో సకల విఘ్నములకు అధిపతి అయిన గణపతిని శివుడు శిరస్సు ఖండన చేసి మరలా గజముఖము పెట్టినప్పుడు జగదంబ పార్వతీ దేవిని ఆనందింప డేయుటకు పరమేశ్వరుడితో సహా దేవతలందరూ పార్వతీ ఒడిలో ఉన్న వినాయకుని స్తుతించిన స్తుతిని విన్న అమ్మ వారు ఎవరైతే ఈస్తుతిని గౌరీ సమేత గణపతిని ఫాల్గుణ శు।।చవితి యందు పఠించి నువ్వలుబెల్లము నివేదన చేసి ప్రసాదముగా స్వీకరిస్తారో అట్టి భక్తులందరికీ నాకేవిధముగా అయితే పుత్రశోకము తొలగి పుత్రవృద్ధి కలిగినదో అదేవిధముగా అందరికీ పుత్రోత్పత్తి కలిగి వంశవృద్ధి జరుగునని జగదంబ పార్వతి వరమిచ్చెను. అట్టి జగదంబ సమేత పుత్రగణపతి అనుగ్రహముపొందుటకు ఈ పుత్రగణపతి స్తోత్రం (పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి) పారాయణము చేయడం వలన వంశదోషములు తొలగి శక్తియుక్తలు కలిగిన పుత్రులు జన్మించునని వరాహపురాణ వచనము. మొదట ఈస్తోత్రముతో డుంఢి రాజు అను కాశీరాజు పుత్రగణపతిని ఆరాధించి సత్ఫలితములను పొందెను. అత్యంత అధ్భుతమైన ఈ స్తోత్రమును ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 8 సంఖ్యతో పారాయణ చేసిన విశేషమైన ఫలితం.
శ్లో।। ఙ్ఞానశక్తిముమాం దృష్ట్వా
యద్ దృష్టం వ్యోమ్ని శంభునా ।
యచ్చోక్తం బ్రహ్మణా పూర్వం
శరీరంతు శరీరిణామ్ ।। 1
శ్లో।। యచ్చాపి హసితం తేన
దేవేన పరమేష్ఠినా ।
ఏతత్కార్య చతుష్కేణ
పృథివ్యాంచ చతుర్ప్యపి ।। 2
శ్లో।। ప్రదీప్తాస్యో మహాదీప్తః
కుమారో భాసయన్ దిశః ।
పరమేష్ఠి గుణైర్యుక్తః సాక్షాత్
రుద్ర ఇవాపరః ।। 3
శ్లో।। ఉత్పన్నమాత్రో దేవానాం
యోషితః సప్రమోహయన్ ।
కాన్త్యా దీప్త్యా తథా మూర్త్యా
రూపేణచ మహాత్మవాన్ ।। 4
శ్లో।। తద్ దృష్ట్వా పరమం రూపం
కుమారస్య మహాత్మనః ।
ఉమానిమీషే నేత్రాభ్యాం
తమ పశ్యతభామినీ ।। 5
శ్రీ పరమేశ్వర ఉవాచ -
శ్లో।। వినాయకో విఘ్నకరో గజాస్యో
గణేశ నామా చ భవస్య పుత్రః ।
ఏతేచ సర్వే తవయాన్తు భృత్యా
వినాయకాః క్రూరదృశః ప్రచండాః ।
ఉచ్చుష్మ దానాది వివృద్ధ దేహః
కార్యేషు సిద్ధం ప్రతిపాదయన్తః ।। 6
శ్లో।। భవాంశ్చ దేవేషు తథా ముఖేషు
కార్యేషుచాన్యేషు మహానుభావాత్ ।
అగ్రేషు పూజాం లభతేన్యధాచ
వినాశయిష్య స్యథ కార్యసిద్ధిం ।। 7
శ్లో।। ఇత్యేవ ముక్త్వా పరమేశ్వరేణ సురైః
సమం కాంచన కుంభ సంస్థెః ।
జలై స్తథా సావభిషిక్తగాత్రో
రరాజ రాజేంద్ర వినాయకానాం ।। 8
శ్లో।। దృష్ట్వాబిషిచ్య మానంతు
దేవాస్తం గణనాయకం ।
తుష్టువుః ప్రయతాః సర్వే
త్రిశూలాస్త్రస్య సన్నిధౌ ।। 9
దేవా ఈచుః - 9
శ్లో।। నమస్తే గజవక్త్రాయ
నమస్తే గణనాయక ।
వినాయక నమస్తేస్తు నమస్తే
చండ విక్రమ ।। 10
శ్లో।। నమోస్తుతే విఘ్నకర్త్రే
నమస్తే సర్పమేఖహో ।
నమస్తే రుద్ర వక్రోత్థ ప్రలంబ జఠరాశ్రిత ।
సర్వదేవ నమస్కారాదవిఘ్నం-
- కురు సర్వదా ।। 11
శ్రీ పార్వత్యువాచ -
శ్లో।। అపుత్రోపి లభేత్ పుత్రా
నధనోపి ధనం లభేత్ ।
యం యమిచ్ఛేత్ మనసా
తం తం లభతి మానవః ।। 12
శ్లో।। ఏవంస్తుత స్తదా
దేవైర్మహాత్మా గణనాయకః ।
అభిషిక్తస్య రుద్రస్య
సోమస్యా పత్యతాం గతః ।। 13
శ్లో।। ఏతస్యాం యస్తిలాన్ భుక్త్వా
భక్త్యా గణపతిం నృప ।
ఆరాధయతి తస్యాశు తుష్యతే
నాస్తి సంశయః ।। 14
శ్లో।। యశ్చైతత్ పఠతే స్తోత్రం
యశ్చైతచ్ఛ్రుణుయాత్ సదా ।
నతస్య విఘ్న జాయన్తే
నపాపం సర్వథా నృప ।। 15
యద్ దృష్టం వ్యోమ్ని శంభునా ।
యచ్చోక్తం బ్రహ్మణా పూర్వం
శరీరంతు శరీరిణామ్ ।। 1
శ్లో।। యచ్చాపి హసితం తేన
దేవేన పరమేష్ఠినా ।
ఏతత్కార్య చతుష్కేణ
పృథివ్యాంచ చతుర్ప్యపి ।। 2
శ్లో।। ప్రదీప్తాస్యో మహాదీప్తః
కుమారో భాసయన్ దిశః ।
పరమేష్ఠి గుణైర్యుక్తః సాక్షాత్
రుద్ర ఇవాపరః ।। 3
శ్లో।। ఉత్పన్నమాత్రో దేవానాం
యోషితః సప్రమోహయన్ ।
కాన్త్యా దీప్త్యా తథా మూర్త్యా
రూపేణచ మహాత్మవాన్ ।। 4
శ్లో।। తద్ దృష్ట్వా పరమం రూపం
కుమారస్య మహాత్మనః ।
ఉమానిమీషే నేత్రాభ్యాం
తమ పశ్యతభామినీ ।। 5
శ్రీ పరమేశ్వర ఉవాచ -
శ్లో।। వినాయకో విఘ్నకరో గజాస్యో
గణేశ నామా చ భవస్య పుత్రః ।
ఏతేచ సర్వే తవయాన్తు భృత్యా
వినాయకాః క్రూరదృశః ప్రచండాః ।
ఉచ్చుష్మ దానాది వివృద్ధ దేహః
కార్యేషు సిద్ధం ప్రతిపాదయన్తః ।। 6
శ్లో।। భవాంశ్చ దేవేషు తథా ముఖేషు
కార్యేషుచాన్యేషు మహానుభావాత్ ।
అగ్రేషు పూజాం లభతేన్యధాచ
వినాశయిష్య స్యథ కార్యసిద్ధిం ।। 7
శ్లో।। ఇత్యేవ ముక్త్వా పరమేశ్వరేణ సురైః
సమం కాంచన కుంభ సంస్థెః ।
జలై స్తథా సావభిషిక్తగాత్రో
రరాజ రాజేంద్ర వినాయకానాం ।। 8
శ్లో।। దృష్ట్వాబిషిచ్య మానంతు
దేవాస్తం గణనాయకం ।
తుష్టువుః ప్రయతాః సర్వే
త్రిశూలాస్త్రస్య సన్నిధౌ ।। 9
దేవా ఈచుః - 9
శ్లో।। నమస్తే గజవక్త్రాయ
నమస్తే గణనాయక ।
వినాయక నమస్తేస్తు నమస్తే
చండ విక్రమ ।। 10
శ్లో।। నమోస్తుతే విఘ్నకర్త్రే
నమస్తే సర్పమేఖహో ।
నమస్తే రుద్ర వక్రోత్థ ప్రలంబ జఠరాశ్రిత ।
సర్వదేవ నమస్కారాదవిఘ్నం-
- కురు సర్వదా ।। 11
శ్రీ పార్వత్యువాచ -
శ్లో।। అపుత్రోపి లభేత్ పుత్రా
నధనోపి ధనం లభేత్ ।
యం యమిచ్ఛేత్ మనసా
తం తం లభతి మానవః ।। 12
శ్లో।। ఏవంస్తుత స్తదా
దేవైర్మహాత్మా గణనాయకః ।
అభిషిక్తస్య రుద్రస్య
సోమస్యా పత్యతాం గతః ।। 13
శ్లో।। ఏతస్యాం యస్తిలాన్ భుక్త్వా
భక్త్యా గణపతిం నృప ।
ఆరాధయతి తస్యాశు తుష్యతే
నాస్తి సంశయః ।। 14
శ్లో।। యశ్చైతత్ పఠతే స్తోత్రం
యశ్చైతచ్ఛ్రుణుయాత్ సదా ।
నతస్య విఘ్న జాయన్తే
నపాపం సర్వథా నృప ।। 15
సేకరణ ః కంచిపీఠ ఆస్థాన సిద్ధాంతి, ఆంధప్రదేశ్ ప్రభుత్వ ఆగమ సలహాదారులు
జ్యోతిష కేసరి, జ్యోతిష చతురానన, దైవజ్ఞశిరోరత్న బిరుదాంకితులు
బ్రహ్మశ్రీ. దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాన్తి
జ్యోతిష కేసరి, జ్యోతిష చతురానన, దైవజ్ఞశిరోరత్న బిరుదాంకితులు
బ్రహ్మశ్రీ. దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాన్తి
పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్రా గణపతి వ్రతం జరుపుకుంటారు. వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది.పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్రా గణపతి వ్రతం జరుపుకుంటారు . మంచి సంతానం కోసం, సంతానం లేని వల్లూ సంతానం కలగడం కోసం ఈ వ్రతం జరుపుకుంటారు అని పురాణాలూ చెబుతున్నాయి.
చతుర్థి నాడు గణపతి కి చేసే పూజ కార్యక్రమాల వాళ్ళ సంతానం కలుగుతుంది అని నమ్మకం.
చతుర్థి నాడు గణపతి కి చేసే పూజ కార్యక్రమాల వాళ్ళ సంతానం కలుగుతుంది అని నమ్మకం.
పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించడం ఫాల్గుణ శుద్ధ చవితి ప్రత్యేకతగ కనిపిస్తూ వుంటుంది. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈ రోజున ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంటారు. పుత్ర సంతానం కావాలనుకునే వాళ్లు ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 'పుత్రగణపతి వ్రతం' ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
వారసుడు కావాలనే కోరిక ... తమ తరువాత ఆడపిల్లల బాగోగులు చూసుకోవడానికిగాను ఒక మగ సంతానం కావాలనే ఆశ కొంతమందిలో బలంగా కనిపిస్తూ వుంటుంది. ఈ విషయంగా ఎక్కువకాలం నిరీక్షించవలసి వచ్చినప్పుడు, పుత్ర గణపతి వ్రతం జరుపుతుంటారు. ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. వాకిట్లో ముగ్గులు పెట్టి ... గడపకి పసుపురాసి కుంకుమ దిద్ది .. గుమ్మానికి తోరణాలుకట్టి .. పూజామందిరాన్ని అలంకరించాలి.
ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పండ్లను ... పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా నియమనిష్టలను ఆచరిస్తూ అంకితభావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతోంది.
పూర్వం మహారాజులు ... చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చిన కారణంగా వాళ్లంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు. తమ తరువాత తమ రాజ్య భారాన్ని కొడుకే స్వీకరించాలని వాళ్లు భావించేవాళ్లు. ఇక పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడే అనే మహర్షుల వాక్యం కారణంగా కూడా వాళ్లు పుత్ర సంతానం కోసం ఆరాటపడే వాళ్లు. ఇందుకోసం వాళ్లు 'ఫాల్గుణ శుద్ధ చవితి' రోజున 'పుత్ర గణపతి' వ్రతాన్ని ఆచరించే వాళ్లు.
అలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫల విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుడిని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు ప్రస్తావిస్తున్నాయి.
ఇక రాజులు తమ ప్రాభవాన్ని కోల్పోయినా ... రాచరికాలు గత చరిత్రగా మిగిలిపోయినా 'పుత్రగణపతి వ్రతం' మాత్రం నాటి నుంచి నేటి వరకూ ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది. ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తలస్నానం చేసి, పరిశుభ్రమైన పట్టువస్త్రాలు ధరించాలి. పూజా మందిరంలో కలశస్థాపన చేసి ... శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి. పుత్రగణపతి వ్రత కథను చదువుకుని దంపతులు అక్షింతలను తలపై ధరించాలి. గణపతికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి.
ఇంచుమించు వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలే ప్రధానంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. తమకి పుత్ర సంతానం కావాలని పూజా సమయంలోనే స్వామివారికి దంపతులు అంకితభావంతో చెప్పుకోవాలి. బుద్ధిమంతుడు ... జ్ఞానవంతుడు ... ఆదర్శవంతుడైన పుత్రుడిని ప్రసాదించమని స్వామిని వేడుకోవాలి. ఈ విధంగా స్వామి మనసు గెలుచుకోవడం వలన అనతికాలంలోనే ఫలితం కనిపిస్తుందని చెబుతారు.
ప్రతి చవితి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండాలి. ఆయన అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలను ప్రకటిస్తూ ఉండాలి. మొక్కుబడిగా కాకుండా ఎవరైతే అంకితభావంతో గణపతిని మెప్పిస్తారో ఆ దంపతులకు అనతికాలంలోనే పుత్ర సంతానం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.
No comments:
Post a Comment