Tuesday, 29 March 2016

ఈశాన్య స్థలమున నివసించే వారికి ధనము పెరిగేకొద్ది?

వాస్తు ప్రకారం ఈశాన్య స్థలమందు నివసించే వారు మంచి ఆలోచనలు కలిగివుంటారు.  ఉద్రేక స్వభావులు. ఇతరులతో వాక్చాతుర్యత, అందంతో ఆకర్షింపబడుతారు. గృహాలు, వీరు నివసించే పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుంటారు. అందరితో కలిసిమెలసి ఉంటారు. పనులను చురుగ్గా ముగిస్తారు. చలాకీగా ఉంటారు. 
 
అయితే వీరికి ధనము పెరిగేకొద్ది పిసినారి తనము అధికమగును. తాము చేయు కృషి ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుంది. తమ బాధ్యతల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. సమయానుకూలంగా ప్రవర్తిస్తారు. దానధర్మముల యందు ఆసక్తి తక్కువ. మానసిక కష్టములున్నప్పటికీ ధైర్యంగా ఎదుర్కొంటారు.
 
ధనాన్ని ఖర్చు చేయడంలో వెనుకడుగు వేస్తారు. డబ్బును పొదుపు చేయడంలో సమర్థులు. వీరి జీవితంలో కష్ట-సుఖాలు సమానంగా ఉంటాయి. స్వయంకృషితో పైకిరాగలరు. స్థిరచరాస్తులు సంపాదించగలరు. 

వాస్తు సలహాలు.. ఉదయం నిద్రలేవగానే ఉత్తర దిశ గా అడుగులు వేయ్యాలా !!!!!!!

వాస్తు ప్రకారం ఉదయం నిద్రలేవగానే ఉత్తర దిశను చూడటం వలన కుబేరస్థానాన్ని చూసినట్లవుతుంది. దీనివల్ల ధనాదాయం ఎప్పుడూ బాగుంటుంది. పక్కమీద నుండి దిగగానే తూర్పువైపుకు కొంచెం నడక సాగించడం మంచిది. దీనివలన తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. మంచి లాభాలు పొందుతారు. 
 
లెట్రిన్‌లో-దక్షిణాభిముఖంగా గానీ ఉత్తరాభి ముఖంగా గానీ కూర్చోవాలి. తూర్పు, పడమరలకు అభిముఖంగా కూర్చోకూడదు. గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యంలో ప్రారంభమై నైరుతివైపుకు చెత్తను ప్రోగు చేయాలి. ఈశాన్యం వైపు చెత్త తీసుకురాకూడదు. 
 
ఆగ్నేయమూల వంట చేసేటప్పుడు తూర్పు అభిముఖంగా నించుని వంట చేయాలి. ఇంటిని చిమ్మే చీపురు శనికి ఆయుధం. కాబట్టి గోడకు ఆనించేటప్పుడు చీపురు హేండిల్ పైకి మాత్రమే పెట్టి ఉంచడం శుభకరం. ఈశాన్యములో దేవుని మందిరాలు నిర్మించి పూజ చేయకూడదు. దీనివల ఈశాన్యం మూత పడటం జరుగుతుంది. తూర్పు గోడలోనే దేవుని గూడును ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం

వాస్తు ప్రకారం ఎఏ వైపు కుర్చుని బుజిస్తే ఏ ఏ ఫలితాలు కల్గుతాయి

మనిషి శక్తికి ముఖ్యమైనది ఆహారం. ఆ ఆహారంలో ఎన్నో రకాలున్నాయి. వివిధ రకాలుగా వివిధ రుచులతో ఇష్టమైన రీతిలో ఆహారాన్ని తయారు చేసుకుని కడుపారా ఆరగిస్తుంటాం. ఆ వంటకాలు ఎంతో శుభ్రంగానూ, రుచిగా.. ఆరోగ్యకరంగా కూడా ఉండాలని భావిస్తాం. 
 
అయితే ఈ ఆహారాన్ని ఏ వైపు కూర్చుని తినాలన్న విషయాన్ని ఆలోచించామా? పూర్వకాలంలో అయితే పీటలు వేసుకుని కూర్చుని భుజించేవాళ్లు. కానీ ఈ ఆధునిక కాలంలో డైనింగ్ టేబుళ్లు అవీ అంటూ ఏ దిశలో కూర్చుంటున్నామో కూడా తెలియడంలేదు. టేబుల్‌ను కూడా సరైన దిశలో అమర్చుకుని తింటే మనకు శుభాలు జరుగుతాయి.
 
తూర్పు ముఖం పెట్టి భుజించడం ద్వారా ఆయుష్షు పెరుగుతుంది. పడమర వైపు కూర్చుని భుజిస్తే ఇంట్లోని సామాను వృద్ధి చెందుతుందట. దక్షిణం వైపు కూర్చుని భుజిస్తే పేరు ప్రతిష్టలు వృద్ధి చెందుతాయట. అంతేకాదు, ఏ కార్యము తలపెట్టినా విజయాలే కలుగుతాయట.
 
ఉత్తరం దిక్కు చూస్తూ కూర్చుని భుజించరాదు. ఆ వైపు ముఖం పెట్టి భుజిస్తే సర్వ అరిష్టాలతో పాటు అనారోగ్యాలు వెన్నంటే ఉంటాయట. టేబుల్‌పైన అయినా సరే, పీట వేసుకుని భుజించే సమయంలోనైనా సరే ఈ దిశలలో కూర్చోవడం ద్వారా సకల శుభాలూ కలుగుతాయి.

 

వాయువ్య దిశ ఎత్తుగా ఉండి పందిళ్ళు వేసుకుంటే?

గృహమందుగానీ, ఖాలీ స్థలమందుగానీ వాయువ్యము మెరక కల్గియున్నట్లైతే వంశవృద్ధి, ఐశ్వర్యముస సకల సుఖాలు కలుగుతాయి.

వాయువ్య దిశ పల్లముగా ఉన్నట్లైతే శత్రువృద్ధి, అజీర్ణ వ్యాధులు స్త్రీలకు అరిష్టములు ప్రాప్తింగలవు. 
 
వాయువ్య దిశ ఎత్తుగా ఉండి అందు పాకలు, పందిళ్ళు, పశుశాలలు ఉంటే ధన ధాన్యాభివృద్ధి, పశు సంపద పెరుగుట వంటి శుభఫలితాలుంటాయి. అలాగే వాయువ్య దిశలో బావులు ఉండకూడదు.
 
ఇలా వుంటే అనేక ఇక్కట్లు తప్పవు. వాయువ్య దిశలో నీళ్ళ కుండీలు, వాటర్ టాంకులు ఉంటే కుటుంబంలో కలహాలు తప్పవు 

North disayandu nutulu , gotulunnatlaite ..?(ఉత్తర దిశయందు నూతులు, గోతులున్నట్లైతే..?)

ఉత్తర దిశలో గృహమందుగానీ, ఖాళీ స్థలమందు గానీ ఉత్తర దిశ మెరక కలిగివున్నట్లైతే గౌరవభంగము, ఐశ్వర్యనాశనము, సంతానారిష్టము కలుగగలవు. 
 
ఉత్తరదిశ తగినంత పల్లము కలిగియున్న అట్టి గృహమందు నివసించువారికి సర్వజనపూజ్యత, పుత్రపౌత్రాభివృద్ధి, యశము, ధనధాన్యసంపదలు సర్వత్ర శుభములు కలుగగలవు. మెరకకలిగిన ఉత్తరమందు పాకలు మొదలగు కట్టడము కలిగి యుండుట వలన క్రమక్రమముగా ధననష్టము, వంశనాశనము కలుగును.
 
ఉత్తర దిశయందు నూతులు, గోతులు, వర్షపు నీరు పోవు కాల్వలు మొదలగునవి యున్నట్లైతే ధనలాభము, సంతతికి అభివృద్ధి కలుగగలదు. 

Saturday, 26 March 2016

Direction,Varga,Aaya,Lordship

Directions rule Ayalu





Life of the building, Vastu Shastra

Vastu Shastra provides exhaustive information about the life of a building for instance, what are the right ways to use a room and what should be the proper area of that room i.e. what should be the length and the breadth. As a result certain rules have been formulated. 

The principles of Ayam are not applicable for buildings with a carpet area less than 2000 sq. ft. these will be only prove beneficial when applied to buildings with a carpet area of more than 2000 sq. ft. For flats and small buildings Ayam principles are, thus, not applicable. Such principles are referred as Vastu Chintamani, Muhurat Martanda or Samrangana Sutradhar. 

To start with the area of the building needs to be by multiplying the length and the breadth. This area will again be multiplied by nine and the product will be divided by eight. The remainder is known as Ayam in Vastu Shastra. The Vedic science further divides the Ayam into 8 categories: 

(1) Dhwajayam (2) Dhumayam (3) Simhayayam (4)Shwanayam (5) Vrishabhayam (6) Kharayam (7) Gajayam (8)Kakayam. 

Dhwajayam: For this Ayam the formula to calculate the area is as follows- 

If the remainder is one it is called Dhwajayam. This is an auspicious ayam. it will be more beneficial put this Ayam to use for constructing bathrooms. It is also useful for steel factories, cloth mills, sugar and rice mills. However if the remainder is Zero it will provide medium level benefits. 

2) Dhumayam: When the remainder amounts to 2 it is known as Dhumayam. This would only be useful in building is kitchens in the south-east direction. According to Vastu Shastra Dhumayam is the harbinger of numerous troubles but primarily it adversely affects the health of the women in the house. 

3) Simhayam: Here, too, the formula is the same. In all the Ayams the formula remains the same. What varies is the remainder. Depending on these remainders Vastu Shastra predicts the auspiciousness and the inauspiciousness of the houses. 

In case the remainder is 3 it is known as Simhayam. This Ayam leads to the destruction of the enemy and victory of the self. Economic and physical happiness is also related with it. Therefore keeping in mind the measurements of Simhayam the bedroom of the head of the family should be constructed in the south direction. Courts, Parliament house, Goverment offices, industrial establishments, commercial complexes and hostels could be constructed by following this. 

4) Shwanayam: If the remainder is 4 it is known as shwanayam. Shwanayam is the perfect Ayam only for lumber-room or storeroom. These should be constructed in the southwest direction. Shwanayam can give good results for hospitals, orthopedics, hardware store, libraries and others. 

5) Vrishabhayam: In this Ayam the remainder will amount to 5. This is an auspicious ayam resulting in the accumulation of wealth. Dining room, bedroom, study room or meditation room should be constructed to the West of the residential building as per Vrishabhayam measurements. This would be quite useful for schools, colleges research centers, cotton mill, textile, sugar factories, receptions halls, auditoriums and others. 

6) Kharayam: The formula to calculate this ayam is as follows: 

If the remainder is 6 it is known as Kharayam. It results in making a man lethargic, even an addict. Hence it is inauspicious in the construction of residences. Garage, granary, godown or servants quarters can be built only in the northwest direction and at a distance of 2 to 3 feet from the wall compound. 

7) Gajayam: This is considered auspicious as it leads to prosperity. The remainder in this kind of Ayam will be 7. With its measurements sitting room or strong room can be built in the north directions. it will prove fruitful for schools, lodgings, commercial establishments, cold storages and shops. 

8) Kakayam: According to the last kind of Ayam only temples can be built with its measurements in the northeast directions. The remainder here will be 8. 

వాస్తు ఇంటి యజమానికి మాత్రమే వర్తిస్తుందా?

వాస్తు ఇంటిలో నివసించే అందరిపై ప్రభావం చూపిస్తుంది. ఒక్క యజమానికో లేదా యజమానురాలుకో సంబంధించిన విషయం కాదు. వారి సంతానం మగ అయినా ఆడ అయినా వాస్తు ప్రభావం వారిపైన కూడా ఉంటుంది. ఈ ప్రభావం ఏ సందర్భంలో ఎలా ఎవరిపై పనిచేస్తుందన్నది ఆ ఇంటిని బట్టి వివరించాలి. 
 
వాస్తు టిప్స్.. 
ఇంటిలో గోడలు వెడల్పులు తగ్గించడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బీరువాని వుంచటానికి నైరుతిమూల గోడమందం తగ్గించకూడదు. దీనివలన నైరుతిమూల పెరిగినట్లవుతుంది. అలాగే తూర్పు ఆగ్నేయం గోడ మందం తగ్గించి అక్కడ వంట కోసం పొయ్యిని ఏర్పాటు చేయకూడదు. ఇలా గోడమందం కొన్నిచోట్ల తగ్గించడం వలన ఇంటి కొలతలతో తేడా వస్తుంది. అది మంచిది కాదు. గోడ మందాలు తగ్గించి అక్కడ అలమరలు ఏర్పాటు చేసుకోవచ్చు.   
 
ఈశాన్యంలో పోర్టికో కట్టుకోవడం వల్ల ఈశాన్యమున అధిక బరువు అంటారు. కాని ఇలా అనటం సరికాదు. తూర్పు లేదా ఉత్తర ఈశాన్యమూలలో పోర్టికో కట్టుకోవచ్చు. స్థలం కన్నా రోడ్డు ఎత్తులో ఉండకూడదు. ఎప్పుడూ రోడ్డు కంటే ఇల్లు ఎత్తులో ఉండాలి. నైరుతిగది వైశాల్యం ఈశాన్యగది వైశాల్యమున కన్నా ఎక్కువగా వుండాలి. అనగా నైరుతి గది ఈశాన్యం గదికన్నా పెద్దదిగా వుండాలి. 

గర్భగుడిలోకి వెళ్లేముందు గడపకెందుకు నమస్కరిస్తారు?

సాధారణంగా ఆలయంలో ప్రధాన ద్వారం వద్ద, గర్భగుడిలోకి వెళ్లేముందు ఉన్న గడపలు రాయితో తయారు చేసి ఉంటారు. ఈ గడపకు ప్రతి భక్తుడూ నమస్కరిస్తుంటాడు. ఇలా ఎందుకు నమస్కరిస్తారనే విషయం చాలా మంది భక్తులకు తెలియదు.
వాస్తవానికి గృహాలకు చెక్కతో తయారు చేసిన గడప ఉంటుంది. అలాగే, ఆలయాలకు అయితే రాయితో తయారు చేసిన గడప ఉంటుంది. ఆలయాలకు రాతితోనే ఎందుకు గడపను తయారు చేస్తారు? ఆ ఆలయ గడపకు ఎందుకు నమస్కరించాలి అనే అంశాలను పరిశీలిస్తే...
రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయముగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించారని పురాణాలు చెపుతున్నాయి. ఈ ఆ భక్తుల కోసం భగవంతుడు కూడా ఆ కొండలమీదే వెలిశాడు. అందుకే ఆ కొండ రాళ్ళ నుంచి వచ్చిన రాయినే మలిచి ఆలయ గర్భగుడులకు గడపగా పెట్టారని శాస్త్రాలు చెపుతున్నాయి.
అయితే, ఆ గడప నిత్యం దైవాన్ని దర్శిస్తూ ఉంటుంది. అలా ఆ గడప రాయి పుణ్యం చేసుకుంది. అందుకే ఆ గడప రాయి చేసుకున్న పుణ్యానికి నమస్కరిస్తూ, కొండ రాయిగా మారిన భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవడమే గడపకు నమస్కరిస్తారని పురాణాలు చెపుతున్నాయి. అందుకే ఆలయాల్లో ప్రధాన గడప తొక్కకుండా దాటాలి

వాస్తు పురుషుని స్థితిని బట్టి ఇంటి నిర్మాణం చేపట్టాలి..

వాస్తు పురుషుని దృష్టి ప్రసరించు దిశయందు- పాదాలు చాచియున్న దిశయందు ఇళ్ళు కట్టరాదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. భాద్రపద, ఆశ్వీజ, కార్తీక మాసాల్లో తూర్పు వైపు శిరస్సు ఉంటుంది. అదే మార్గశిర, పుష్య, మాఘ మాసాల్లో దక్షిణ వైపు శిరస్సు ఉంటుంది.
జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ మాసాల్లో ఉత్తర వైపు శిరస్సు, ఫాల్గుణ, చైత్ర, వైశాఖలలో పడమటి శిరస్సు ప్రకారం వాస్తు పురుషుడు ఎప్పుడూ ఎడమ పక్కగా శయనిస్తుంటాడు. పైన చెప్పిన మాసాల్లో వాస్తు పురుషుని పడకదిశ గ్రహించి, తల వెనుక భాగం- వీపు భాగం ఏవైపు ఉంటే ఆ దిక్కుల్లో ఇళ్ళు నిర్మించుకోవచ్చు

పాడుబావులు, మొండి గోడలు ఉంటే

ఉత్తర ఈశాన్య సింహాద్వారం కలిగినప్పుడు ఎదురుగా దక్షిణ ఆగ్నే‌యమున కిటికి గాని ద్వారం ఏర్పాటు చేసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పాడుబడిన బావులు గాని, మొండి, గోడలు గాని, ఎండిన చెట్లుగాని ఇంటి ఆవరణలో ఉండుట మంచిది కాదని వారంటున్నారు.
తాత్కాలిక ఇళ్ళు తూర్పు దిక్కునగాని ఉత్తర దిక్కునగాని నిర్మించరాదు. ప్రహారి గోడలకు మూడు గేట్లు ఉండరాదు. సరిసంఖ్యలో ఉండుటమంచిది. మండువా ఇళ్ళకి, డాబాకి మరియు వాలు వసారాలకు వెన్నుపోటు దోషం ఉండదు. గృహములకు, ఉపగృహములకు మధ్యలో బావి ఉండుట మంచిది కాదు

ఉత్తరంలో చెత్తడబ్బా, చీపురు, వాషింగ్‌ మెషీన్‌లు ఉంచవచ్చా?

జీవించేందుకు సౌకర్యవంతమైన ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే సొంతింటి కళ నెరవేర్చుకుంటే మాత్రం సరిపోదు, వాస్తుకు చెందిన మెలకువలు తెలుసుకోవాలి. వాస్తు ప్రకారం ఇల్లుంటే లక్ష్మీదేవి కొలువవుతుందని, సంపద సృష్టికి మార్గమవుతుందని వాస్తు పండితులు అంటున్నారు. 
 
* ఇంటి ఉత్తర ప్రాంతంలో నీలిరంగు వేయాలి. ఇక్కడ వంటగది, టాయ్‌లెట్లు ఉండే విధంగా చూసుకోవాలి. ఈ ప్రాంతంలో చెత్తడబ్బా, చీపురు, వాషింగ్ మెషీన్‌లను ఉంచవద్దు. వంటగది అంటే అగ్నిదేవుడు కొలువై ఉండే ప్రాంతం. ఏదైనా వస్తువులు తప్పుడు స్థానంలో ఉంచితే, డబ్బు నీళ్లలా ఖర్చవుతుంది. కెరీర్ దెబ్బతినే అవకాశాలు చాలా ఉన్నాయి.
 
* అన్ని ప్రాంతాలలో ఈశాన్య ప్రాంతం ఎంతో ముఖ్యమైనది. ఈశాన్య ప్రాంతంలో నిబంధనలు పాటిస్తే, బ్యాంకుల నుంచి ఋణాలు సులభంగా అందుతాయి. ఇతరుల నుంచి పెట్టుబడులు చేకూరుతుంది. వాస్తుని పాటించిన గృహాలు నిత్యం సకలసంపదలతో కళకళలాడుతూ ఉంటుంది.
 
* ఇంటి ప్రధాన ద్వారం అందంగా ఉంటే సంతోషంతో పాటు శ్రేయస్సు సిద్ధిస్తుంది. ఇంటికి పచ్చని తోరణాలు మంచి రంగులు, గడపకు పసుపు కుంకుమలతో అలంకరిస్తే సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతుంది. కష్టాలు దూరంగా జరుగుతాయి. ఉదాహరణకు వాయవ్యంలో తలుపుంటే రుణాలు, ఆర్థిక సమస్యలు వస్తాయి. ఉత్తరంలో ద్వారముంటే, మంచి కెరీర్, ఆర్థిక స్థిరత్వం సుసాధ్యం. తూర్పున తలుపున్న ఇంట శాంతి సిద్ధిస్తుంది. పశ్చిమాన తలుపుంటే ధనలాభాలు లభిస్తుంది. దక్షిణాన తలుపున్నా మంచిదే.
 
* ఆగ్నేయాన వంటగది ఉండాలి. లేత ఎరుపు, నారింజ, గులాబీ రంగులు సూచించే కలర్స్ వేస్తే మంచిది. బీరువా, పని చేసుకునే టేబుల్, డ్రాయింగ్ రూం తదితరాలు ఉత్తరం వైపున ఉంటే సరిపడినంత ధనం లభించే అవకాశాలుంటాయి.
 
* పడమర వైపున తెలుపు, పసుపు రంగులు శుభసూచకం. ఇక ఇంట్లోని నైరుతీ ప్రాంతం సేవింగ్స్‌ను సూచిస్తుంది. కాబట్టి ఈ ప్రాంతం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పిల్లల చదువులకు వినియోగించవచ్చు.ఈ ప్రాంతంలో బీరువాను ఉంచి డబ్బు, ఇతర విలువైన వస్తువులు ఉంచితే అవి కలకాలం భద్రంగా ఉంటుంది. ఈ నిబంధనలు పాటిస్తే, ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ సమతూకంగా ఉంటూ సుఖశాంతులు, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి.

గడపపై కూర్చోవడం మంచిదా? అలా కూర్చుంటే ఏమౌతుందో తెలుసా?

ఇంటికి ప్రధాన ద్వారంపై కూర్చోవడం మంచిదా? అలా కూర్చుంటే అరిష్టం, దారిద్ర్యమా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. ఇంటికి ప్రధాన ద్వారానికి గల గడపపై కూర్చోకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ప్రధాన ద్వారానికి సాధారణంగా బేసి సంఖ్యలో మెట్లుండాలి. ఇంకా గడపపై కూర్చోవడం మంచిది కాదని వారంటున్నారు. కిటికీలు, ద్వారాల ద్వారానే గాలి, వెలుతురు ఇంటిలోకి వచ్చి వెళ్తూంటాయి.

అలాంటప్పుడు ఇంట్లోకి వచ్చే గాలిని, వెలుతురును, ఇంటిలోపల గల నెగటివ్‌ ఎనర్జీ బయటికి తీసుకెళ్లే గాలిని గడపపై కూర్చుని అడ్డుకోవడం సైన్స్ పరంగా మంచిది కాదని.. ఇలా చేయడం ద్వారా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇక ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే.. గడపకు మధ్యలో కూర్చోవడం మంచిది కాదు. గడపపై కూర్చోవడం, గడపకు దిగువనున్న మెట్లపై కూర్చోవడం కూడా అంత మంచిది కాదు. అలా కూర్చుంటే ఇంటిలోనికి వచ్చే లక్ష్మీదేవిని అడ్డుకున్న వారవుతామని పండితులు అంటున్నారు. అంతేగాకుండా ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు.. ప్రధాన ద్వారం అమర్చేటప్పుడు పూజలు నిర్వహించి, నవరత్నాలు, పంచలోహ వస్తువుల్ని ప్రధాన ద్వార గడప కింద ఉంచడం ఆనవాయితీ.

అందుకే ప్రధాన ద్వారాన్ని దైవాంశంగా, లక్ష్మీదేవిగా పూజిస్తాం. కాబట్టి దైవాంశం నిండిన ప్రధాన ద్వారం (గడప)పై కూర్చోవడం.. లక్ష్మీదేవిని అవమానించినట్లవుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా ఇలా కూర్చోవడం ద్వారా ఈతిబాధలు ఉత్పన్నమవుతాయని, అరిష్టమని వారు సూచిస్తున్నారు.